కనిగిరి పట్టణంలో వైసిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 1 వ వార్డులో వైసిపి నాయకులు, కార్యకర్తలతో మున్సిపల్ చైర్మన్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో వైసీపీని బలపేతం చేసేందుకు వార్డుల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులో విజయం సాధించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు.