చేవెళ్ల: మున్సిపాలిటీ మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్పల్లి మున్సిపాలిటీ మరియు పట్నం అంత పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో ఆయనే దగ్గరుండి పారిశుద్ధ్య సిబ్బందితో చెత్తాచెదారం, మట్టి కుప్పలు మరియు రాళ్లు ఇతర వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలను మరియు వార్డులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.