జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి గురువారం జిల్లాలోని ఎమ్మెల్యే పాయింటును తనిఖీ చేశారు.. ఎం. ఎల్.ఎస్. పాయింటులోని సరుకులను పరిశీలించి వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి ఐదు మండలాల పరిధిలోని 170 రేషన్ దుకాణాలకు సరుకులు సరఫరా అవుతాయని అధికారులు ఆమెకు వివరించారు. రికార్డుల నిర్వహణ నిబంధనల మేరకు ఉండాలని, ఈ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంట పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, స్థానిక అధికారులు ఉన్నారు.