అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ వద్దనున్న ఎం వై ఆర్ ఫంక్షన్ హాల్ సమీపాన ద్విచక్ర వాహనంను ఢీకొన్న ఆటో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న సిండికేట్ నగర్ కు చెందిన మా భాష అనే వ్యక్తికి కాలు విరగడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో సిండికేట్ నగర్ నుండి అనంతపురం టౌనుకు వస్తుండగా ఎం వై ఆర్ ఫంక్షన్ హల్ సమీపాన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.