అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్న శ్రీ బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో ఓ వ్యక్తి సెల్ ఫోన్ చోరికి గురైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రామరంగేశ్వరుడు అనే వ్యక్తి తొండపాడు గ్రామంలో జరిగే రంగనాథుడి బ్రహ్మోత్సవాలకు కుటుంబసమేతంగా వెళ్ళాడు. అయితే గ్రామంలో తిరునాలలో తిరుగుతుండగా రామరంగేశ్వరుడుకు చెందిన రూ.15వేలు విలువ చేసే సెల్ ఫోన్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గమనించిన బాధితుడు తొండపాడు గ్రామంలో ఉన్న పోలీసు ఔట్ పోస్ట్ లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు.