అనంతపురంలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి జరిగిన ఈనాడు దినపత్రిక 50 వసంతాలు, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ఘన స్వాగతం పలికారు. నిర్వాహకులను ఎమ్మెల్యే ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనాడు, ఈటీవీల ప్రాముఖ్యత గురించి ఎమ్మెల్యే సురేంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు.