మేడ్చల్: ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఉప్పల్ ట్రాఫిక్ జోన్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డిని కలిసి సిపిఐ వినతి
ఉప్పల్ చౌరస్తా GHMC కార్యాలయానికి ఆనుకుని ఉన్న బస్టాప్ లో జిల్లా సర్వీస్ మరియు సిటీ బస్సుల రద్దీ కారణంగా నిత్యం ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ ట్రాఫిక్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్లారెడ్డి కి సీపీఐ బృందం బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్ బోస్ నియోజకవర్గం కార్యదర్శి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు