అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 10 :30 గంటల సమయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ 504 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్డీసిలు రామ్మోహన్, ఆనంద్, మల్లికార్జునుడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.