కళ్యాణ్ దుర్గం లో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Nov 20, 2025
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ బ్రహ్మసముద్రం కు చెందిన ఆనంద్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు కళ్యాణ్ దుర్గం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆనంద్ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.