గుత్తి పట్టణంలోని కుంట కట్ట వద్ద అప్పుడే పుట్టిన ఆడ నవజాత శిశువును కసాయిలు వదిలి వెళ్లారు. బుధవారం ఉదయం స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నవజాత శిశువును పరిశీలించారు. అయితే అప్పటికే మృతి చెందింది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువును వదిలిన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ, దర్యాప్తు చేపట్టారు.