అనంతపురం నగరంలోని ఆరవ రోడ్డుకు చెందిన ఈశ్వరయ్య అనే వృద్ధుడు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని తాటిచెర్ల గార్లదిన్నె రైల్వే స్టేషన్ల మధ్యలో ఉన్న డౌన్ లైన్ 226 /26-28 కిలోమీటర్ రాయి వద్ద గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు రైల్వే ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.