సంతనూతలపాడు మండలం మైనంపాడు లో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం ముగిసింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ మైనంపాడు లో నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినా, గెలిచినా యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు పాల్గొన్నారు.