అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి పట్టణ సమీపంలో ఉన్న రాజారెడ్డి కాలనీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పెద్దవడుగూరుకు చెందిన వెంకట రాముడు అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.