అసిఫాబాద్: శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ఈనెల 22న ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా:DYFI
కుల దురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ నెల 22న ASF కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు DYFI జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆసిఫాబాద్ (M) దెమ్మిడిగూడలో ఛలో కలెక్టరేట్ కరపత్రాలను ఆయన విడుదల చేశారు. శ్రావణి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల సాగుభూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.