అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పసలూరులో గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కుల్లాయప్ప అనే వ్యక్తి ఇంటి దగ్గర కూర్చొని ఉండగా మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు వచ్చి కుళ్లాయిప్పపై కట్టెలతో దాడి చేసి పరారయ్యారు. కుల్లాయప్పకు తీవ్రగాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.