ప్రభుత్వ సర్వేలు, అధికారుల ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ విధులకు గైర్హాజరైన 8 మంది సచివాలయం వెల్ఫేర్ సెక్రెటరీలను సస్పెండ్ చేసినట్లు డోన్ మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. కేటాయించిన పనులు పూర్తి చేయని వారిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న సర్వేలను పూర్తి చేస్తేనే తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు.