ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కళ్యాణదుర్గం పట్టణానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావుకు స్వాగతం పలికారు. ప్రవచనాల ప్రారంభ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడారు. గరికపాటి నరసింహారావు మహాభారతం, రామాయణం వంటి వాటిలోని ఆధ్యాత్మిక వచనాలను ప్రజలకు తెలియజేస్తూ ఆధ్యాత్మికత గొప్పతనాన్ని చెబుతున్నారన్నారు.