వికసిత్ భారత్ జీ గ్యారెంటీ రామ్ జీ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. యాడికి లో బుధవారం రామ్ జీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 125 రోజులు పని కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీర్రాజు, ఏ పీ ఓ మద్దిలేటి, ఏఈ లోకేష్, ఉపాధి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.