అనంతపురం నగరంలోని సాయి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై గాయాల పాలయ్యాడు. దీంతో అతనిని తోటి కార్మికులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం మంగళవారం ఉదయం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.