జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయదుర్గం వచ్చిన ఆహుడా చైర్మన్ వరుణ్, హస్తకళల కార్పోరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ల కు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కురుబ కార్పోరేషన్ డైరెక్టర్ మంజునాథ్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వారు పాల్గొన్నారు. లక్ష్మీబజార్, వినాయక కూడలి, బళ్లారి రోడ్డు మీదుగా ఉత్సాహంగా ఈ బైక్ ర్యాలీ సాగింది.