కళ్యాణదుర్గంలో ఆదివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను ఎన్టీ రామారావు అన్ని విధాల అభివృద్ధి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు