మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వాహనాలలో తరలి వెళ్తున్నారు. దీంతో దోర్నాల గణపతి చెక్ పోస్ట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు బస్సులు ద్విచక్ర వాహనాలతో పరిసర ప్రాంతాల నిండిపోయాయి. పోలీసులు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.