భారత ప్రభుత్వం 16వ జనాభా గణన (2027) కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు సెన్సెస్ అధికారి సి. విష్ణు చరణ్ ఆదేశించారు.గురువారం రాత్రి 7 గంటల సమయంలో అనంతపురం జేఎన్టీయూ లో జన గణన పై గత రెండు రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహణ అనంతరం మూడవరోజు గురువారం సాయంత్రం 6:30 సమయంలో ముగిసింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హాజరై జరుగుతున్న శిక్షణ ను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణలో విధివిధానాలపై అధికారులు సంపూర్ణ అవగాహనతో పనిచేసి 100% శాతం పూర్తి చేయాలన్నారు.