అనంతపురం నగరంలోని రాంనగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో సంఘటనా స్థలాన్ని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతుడు 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని తెలిపారు. అతనిని గుర్తుపట్టిన యెడల 9247575613 నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.