చీపురుపల్లి: చీపురుపల్లి పట్టణంలో కొత్తగవిడి వీదలో గ్యాస్ ప్రమాదాలు పై అవగాహన కల్పించిన అగ్ని మాపక అధికారులు
గ్యాస్ ప్రమాదాలు పై మహిళలు అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపక అధికారి డి హేమ సుందర్రావు అన్నారు. అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో కొత్తగవిడి వీదలో గ్యాస్ ప్రమాదాలు పై మహిళలకు బుధవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ ప్రమాదాలు జరినప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు ప్రజలు వివరించారు. గ్యాస్ ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు డెమో నిర్వహించి చూపించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది డి. రామారావు ఆదినారాయణ గౌరిశంకర్ పాల్గొన్నారు.