మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం రథోత్సవ కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఫైమా నరేష్ ఇతర కళాకారులు ఎస్వి మెగా ఈవెంట్ తరుపున వస్తున్నట్లు స్వయంగా తెలియజేశారు