అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండలం ముద్దలపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముద్దలాపురం గ్రామానికి చెందిన అంజి అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.