ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షన్ దారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. తమకు పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు ఐఆర్ పెంచాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు.