మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రభుత్వ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు బదిలీ కావడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన వైద్యులను ఏర్పాటు చేయాలని కోరారు.