ఈగల్ టీం సీఐ సుధాకరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు పట్టణంలోని లారీ అసోసియేషన్ మరియు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి నిర్మూలన మరియు తరలింపు వంటి అంశాలపై అవగాహన కల్పించి అటువంటి కార్యకలాపాలలో పాలు పంచుకుంటే కఠిన చర్యలు తప్పవని లారీ డ్రైవర్లకు తెలిపారు. అలానే గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సిఐ సుధాకర్ రావు ప్రజలకు తెలిపారు. అంతేకాకుండా స్థానిక పరిసర ప్రాంతాలలో రోడ్ ఎగరవేసి పరిసరాలను పోలీసులు పరిశీలించారు.