కంపోస్ట్ పేస్ట్ తయారు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి పథకం లో అవకాశం కల్పించిందని రాచర్ల మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏవో మహాలక్ష్మి సోమవారం తెలిపారు. తడి చెత్తను ఎక్కడపడితే అక్కడ పార వేయకుండా మన ఇంటి ఆవరణలోనే ఒక గుంత తీసి అందులో పాతి పెడతామని అందుకు రూ.816 నగదు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పథకంలో అందిస్తుందన్నారు. తడి చెత్త ఆ గుంతలో పాతి పెట్టడం ద్వారా అది ఎరువుగా మారుతుందని తర్వాత మన ఇంటి పెరటిలోని మొక్కలకు ఉపయోగించుకోవచ్చని మహాలక్ష్మి అన్నారు. ఇంటివద్దె కాకుండా పొలాలు, కల్లాలు, ఎరువు నిల్వ చేసుకునే ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.