అనంతపురం నగరంలోని భైరవనగర్ ఏడవ క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ లో నుంచి కిందపడి అతని పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విడపనకల్లు మండలం ఉండబండ గ్రామానికి చెందిన ఉప్పర రామాంజనేయులు అనే కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.