ధర్మారం: ధర్మారంలో మెడిటేషన్ లో అందిస్తున్న సేవలను గుర్తించి గురువులను సన్మానించిన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యులు
ధర్మారం మండల కేంద్రంలోని హార్ట్ ఫుల్ నెస్ సెంటర్ లో శ్రీరామచంద్ర మిషన్ మండల కో-ఆర్డినేటర్ ఇమ్మడిశెట్టి మల్లేష్-నాగలక్ష్మి దంపతులను మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. మెడిటేషన్, సత్సంగ్ కార్యక్రమంలో భాగంగా వారు అందిస్తున్న సేవలకు గాను ధర్మారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎలగందుల అశోక్ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు.