ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దుకురపాడు ప్రభుత్వ పాఠశాలలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో మంచిగా రాణించాలని ఉన్నత పదవులు పొందాలన్నారు. తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.