కుప్పం: రైలు నుండి కింద పడి యువతి మృతి
కుప్పం మండలంలోని పెద్ద గోపనపల్లి వద్ద అశోకపురం ఎక్స్ప్రెస్ రైలు నుంచి పడి గుర్తుతెలియని యువతి(18) మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.