రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గడిచిన 20 నెలల కాలంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుని సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని రాయదుర్గం MLA కాలవ శ్రీనివాసులు తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గత 20 నెలలుగా ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద మరియు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కా