ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యధికంగా రెవెన్యూ సమస్యలు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. రెవిన్ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి కలెక్టర్ రాజాబాబు పరిష్కరిస్తారని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి తెలిపారు.