మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి గిరి రాజా కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో గోపాలపురంలో పనిచేస్తున్న రామ్ మోహన్ ను నియమించారు. త్వరలో ఆయన పొదిలికి రానున్నట్లు అధికారులు తెలిపారు. పాత అధికారి గిరి రాజా కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఆయన ట్రాన్స్ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నట్లు తెలిపారు.