మేడ్చల్: దుండిగల్ లో గ్లోబల్ సమ్మిట్ వేదికను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
హైదరాబాదులో రెండు రోజులపాటు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దుండిగల్ లో ఈ సమ్మిటి వేదికకు అవసరమైన స్థలాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నతాధికారులు జయేశ్ రంజన్, శశాంక, నర్సింహారెడ్డి, ముషారఫ్ అలీ పాల్గొన్నారు.