నంద్యాల తెలుగుగంగ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమవేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా వైసిపి నాయకులు గత ప్రభుత్వంలో లిప్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు మొదలు పెట్టారనీ ప్రశ్నించారు.పోతిరెడ్డిపాడు పనులు జరిగే సమయంలోనే కెసిఆర్,జగన్ ఒకరి ఇండ్లకు ఒకరు వెళ్ళారనీ ఆరోపించారు.అదే సమయంలో హరీష్ రావు లిప్ట్ ఇరిగేషన్ పనులు అపాండి అంటు లేఖలు రాస్తారన్నారు.సీమకు అన్యాయం జరుగుతుంది అనే వాళ్ళు సీమకు ఏం చేశారో చెప్పాలనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీమలో ప్రాజెక్టులు మొదలు పెట్టింది, పూర్తి చేసింది టిడిపి ప్రభుత్వమేనని అన్నారు.