గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ లోని ఓ బ్రాందీ షాపులో పట్టపగలే చోరీ, రూ.2,500 నగదు అపహరణ, దొంగలను పట్టుకున్న స్థానికులు
గుత్తి ఆర్ఎస్ లో మెయిన్ బజార్ లో ఉన్న ఓ బ్రాందీ షాపులో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. ముగ్గురు యువకులు బ్రాందీ షాప్ వెనక భాగం నుంచి లోపలికి ప్రవేశించారు. క్యాష్ బాక్స్ లో ఉన్న సుమారు రూ. 2,500 నగదును చోరీ చేశారు. స్థానికులు గమనించి వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన యువకులు హైదరాబాదుకు చెందిన వారుగా తెలుస్తోంది. విచారణ చేపట్టారు.