మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం లో నన్నారి షరబత్ పంటకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడం శనివారం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఎకరా పొలంలో పంటతో పాటు డ్రిప్పు పైపులు కూడా కాళీ బూడిద అయ్యాయి. దీంతో సుమారు 6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు నాగరాజు వాపోయారు. పోలీసులు దర్యాప్తు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.