యాడికి మండలం చందన గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి ఇంటిలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మంటలు చెలరేగి ఇంటిలోని వస్తువులన్నీ కాలిపోయాయి. మంటలు ఆర్పడానికి ఇంటి యజమానితో పాటు స్థానికులు శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. సుమారు రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.