నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం రోజున నిర్వహించే లింగోద్భవ సమయంలో నిరంతర దర్శనాన్ని కల్పిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రిలో నిరంతరంగా ఉచిత దర్శనం భక్తుల సౌకర్యార్థం ఉచిత మజ్జిగ, పాలు, శుద్ధ జలాలను అందిస్తున్నామన్నారు. శివరాత్రి దిగ్విజయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు.