యువకులు BJP పట్ల ఆకర్షితులవుతున్నారని వారి కృషి తో భవిష్యత్తులో APలోనూ అధికారంలోకి వస్తామని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు కొనగొండ్ల రాజేష్ అన్నారు. సోమవారం కణేకల్ లోని పార్టీ కార్యకర్త ఇంటిలో జరిగిన వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి అందరూ అండగా నిలవాలని ఆయన సారధ్యంలో దేశం పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జ్ హీరోజీరావు, వసుంధర పాల్గొన్నారు.