నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లె సమీపంలో నీళ్లు తాగడానికి వెళ్లిన 80 గొర్రెలు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది.బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లెకు చెందిన నగేష్, ఆంజనేయులు తమ గొర్రెలను నందవరంలో మేత కోసం తీసుకెళ్లారు. మధ్యంలో చెరువుపల్లె వద్ద గుంతలో నీళ్లు తాగడానికి వెళ్లిన గొర్రెలు ఒకదానిపై ఒకటి పడి 80 చనిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.