కాల్వపల్లి సమీపాన ద్విచక్ర వాహనం ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లి సమీపాన గురువారం రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న అనంతపురం నగరానికి చెందిన వేణుగోపాల్, పెనోఓబులేసుకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. సెట్టూరునుండి అనంతపురం టౌన్ ద్విచక్రవాహనoలో వస్తుండగా కాల్వపల్లి సమీపాన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.