ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రభుత్వం ప్రత్యేక రెసిడెన్షియల్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి రామాంజనేయులు తెలిపారు. దర్శి దొనకొండ ముండ్లమూరు మండలాల ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల ఉత్తీర్ణత శాతం పెరగాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.