అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఉన్న సంపద ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలి పైకి ద్విచక్ర వాహనం దూసుకుని రావడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో వైయస్సార్ కడప జిల్లా సింగేపల్లి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.