మార్కాపురం జిల్లా త్రిపురాంతకం గ్రామంలోని ఉప్పల గుట్టలో వెలసిన శ్రీ నాగ స్వరూప ఎల్లమ్మ దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పొట్టి వంశస్థులు సుబ్బారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొట్టి వంశస్థులు కలిసి నిర్మించిన ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున అభిషేకం పొంగళ్ళు కుంకుమార్చన ప్రత్యేక పూజాలు చేస్తారన్నారు. అనంతరం అన్నదానం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.